వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-09-29T06:42:29+05:30 IST

వర్షాల కారణంగా నీరు నిలిచిపోయి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు.

వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ మల్లికార్జున

నేడు డ్రైడేగా పాటించాలి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

మహారాణిపేట, సెప్టెంబరు 28: వర్షాల కారణంగా నీరు నిలిచిపోయి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తి చెందుతాయని, అందువల్ల నీటిని క్లోరినేషన్‌ చేయాలన్నారు. బుధవారం డ్రైడేగా పాటించాలని, దీనిపై ప్రజలకు పంచాయతీ సిబ్బంది, ఆశ, ఏఎన్‌ఎం, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు అవగాహన కల్పించాలని తెలిపారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వైద్య శిబిరాలు నిర్వహిం చాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2021-09-29T06:42:29+05:30 IST