మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు

ABN , First Publish Date - 2021-07-10T21:26:29+05:30 IST

కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జూలై 19 వరకు పొడిగించింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కొన్ని

మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు

చెన్నై: కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జూలై 19 వరకు పొడిగించింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కొన్ని ఆంక్షలను కూడా సడలించింది. దుకాణాలు మూసివేసే సమయాన్ని రాత్రి 9 గంటల వరకు పొడిగించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ రెస్టారెంట్లు, టీ షాపులు, బేకరీల్లాంటి దుకాణాలను యాభై శాతం కస్టమర్లతో 9 గంటల వరకు నిర్వహించుకోవచ్చునని తెలిపింది. పెళ్లికి 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతులిచ్చింది. 


స్కూళ్లు, కాలేజీలు, బార్లు, థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్, జూలను తెరవకూడదని నిర్ణయించింది. బహిరంగ సభలను నిర్వహించకూడదని తెలిపింది. కాగా తమిళనాడు అంతరాష్ట్ర బస్సు సర్వీసులను కూడా పునరుద్ధరించలేదు.

Updated Date - 2021-07-10T21:26:29+05:30 IST