ఎమ్మిగనూరులో రాస్తారోకో

ABN , First Publish Date - 2020-02-28T10:52:27+05:30 IST

ఎమ్మిగనూరులో రాస్తారోకో

ఎమ్మిగనూరులో రాస్తారోకో

ఎమ్మిగనూరు: టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఎమ్మిగనూరులో టీడీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. సోమప్ప సర్కిల్‌లో ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్కిల్‌ రాస్తారోకో చేశారు. పార్టీ నాయకులు కొండయ్య చౌదరి, రాందాస్‌ గౌడ్‌, సందరరాజు, నరసింహులు మాట్లాడుతూ ప్రజాచైతన్య యాత్రకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకోవటం దారుణమని అన్నారు. ఇది ప్రజాస్వామాన్ని ఖూనీ చేయటమేనని అన్నారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయలేక ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు నాగేషప్ప, శాబిర్‌, గోరంట్లప్ప, ఉసేన్‌ పీరా,  దయాసాగర్‌, కటారి రాజేంద్ర, మధు, రంగస్వామి గౌడ్‌, దాదా సాహేబ్‌, కదిరి కోట ఆదెన్న, జయన్న, ఆచారి, సలీం, సలాం, అల్తాఫ్‌, అబ్దుల్‌, రంజాన్‌, ఈరన్న, కృష్ణ, రామకృష్ణ,  రమేష్‌, సర్వేశ్వర్లు, మహేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-28T10:52:27+05:30 IST