నిద్ర వీడితే.. అభివృద్ధి కనిపించేది

ABN , First Publish Date - 2020-12-05T04:16:10+05:30 IST

స్థానిక ఎమ్మెల్యే ఫాల్గుణ నిద్ర వీడి కళ్లు తెరిచి చూస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి కనిపిస్తుందని టీడీపీ నాయకుడు సివేరి అబ్రహం అన్నారు.

నిద్ర వీడితే.. అభివృద్ధి కనిపించేది
సమావేశంలో మాట్లాడుతున్న సివేరి అబ్రహం


టీడీపీ నేత సివేరి అబ్రహం 

అరకులోయ, డిసెంబరు 4: స్థానిక ఎమ్మెల్యే ఫాల్గుణ నిద్ర వీడి కళ్లు తెరిచి చూస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి కనిపిస్తుందని టీడీపీ నాయకుడు సివేరి అబ్రహం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ చంద్రబాబు హయాంలో మన్యం చీకటిలోకి వెళ్లిందని అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెదలబుడును దత్తత తీసుకొని చేసిన అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు. ప్రతీ గ్రామంలో చంద్రన్న బాటల పేరిట సిమెంటు రోడ్లు, వీధి కాల్వలు, నీటి పథకాలు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు శెట్టి బాబూరావు, శెట్టి అప్పాలు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T04:16:10+05:30 IST