మేడికొండూరు ఘటనపై ఏం సమాధానం చెబుతారు?: బీదా రవిచంద్ర

ABN , First Publish Date - 2021-09-09T17:52:16+05:30 IST

గుంటూరు జిల్లా మేడికొండూరులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వాన్ని టీడీపీ నేత బీదా రవిచంద్ర ప్రశ్నించారు.

మేడికొండూరు ఘటనపై ఏం సమాధానం చెబుతారు?: బీదా రవిచంద్ర

అమరావతి: గుంటూరు జిల్లా మేడికొండూరులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వాన్ని టీడీపీ నేత బీదా రవిచంద్ర ప్రశ్నించారు. జీరో ఎఫ్ఐఆర్ అని ఊదరగొట్టిన డీజీపీ..సత్తెనపల్లిలో కేసు ఎందుకు రిజిస్టర్ కాలేదని నిలదీశారు. లోకేష్ కోసం పెట్టిన 3వేల మంది పోలీసుల బందోబస్తు..అత్యాచారాలు జరగకుండా ఉపయోగిస్తే బాగుంటుందని హితవుపలికారు. హైకోర్టు అక్షింతలు వేస్తున్నా కొంతమంది పోలీసు అధికారులలో మార్పు రావటం లేదని బీదా రవిచంద్ర అన్నారు. 

Updated Date - 2021-09-09T17:52:16+05:30 IST