కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలు కట్టొద్దనడం విచారకరం: లోకేష్
ABN , First Publish Date - 2021-02-27T19:24:22+05:30 IST
కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలు కట్టొదన్న పోలీసులు హెచ్చరికపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు.
అమరావతి: ఎన్నికల కోడ్, కరోనా మార్గదర్శకాల మేరకు కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలు కట్టొద్దని పోలీసులు హెచ్చరించడం చాలా విచారకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని ఇలా అడ్డుకోవడం అపచారమని తెలిపారు. ప్రభలన్నీ పల్లెల నుంచే బయలుదేరుతాయని...పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయని వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలే కానీ... భక్తులు మనోభావాలు, ఆచారమైన ప్రభలు కట్టొద్దని ఆదేశించడం ముమ్మాటికీ సంప్రదాయాలను కాలరాయడమే అని విమర్శించారు. పరమపవిత్రమైన తిరుమల లడ్డూలు ఓటర్లకి పంచడం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన అని... తరాలుగా వస్తున్న ప్రభలు కాదు అని లోకేష్ వ్యాఖ్యానించారు.