మరో ఆప్ఘన్‌లా ఏపీ : Nallamilli

ABN , First Publish Date - 2021-10-21T17:35:49+05:30 IST

ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే విధంగా జగన్ రెడ్డి పాలన ఉందని... ఇందుకు పోలీసులు సహకరిస్తున్నారని టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.

మరో ఆప్ఘన్‌లా ఏపీ : Nallamilli

అమరావతి: ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే విధంగా జగన్ రెడ్డి పాలన ఉందని... ఇందుకు పోలీసులు సహకరిస్తున్నారని టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. పోలీసు వ్యవస్థ వైసీపీ అనుబంధ సంఘంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని... మరో ఆప్ఘన్‌లా ఏపీ మారిందన్నారు. వైసీపీ పాలనలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏపీని హెరాయిన్, డ్రగ్స్ అడ్డాగా మార్చారన్నారు. జగన్ రెడ్డికి ఎందుకు ఓటేశామా అని ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని ఆయన తెలిపారు.


వైసీపీ నేతలు, మంత్రులు మాట్లాడే మాటలు బూతులు కాదా డీజీపీ అని ప్రశ్నించారు. కొడాలి నాని మాటలు డీజీపీకి వినిపించడం లేదా అని నిలదీశారు. చంద్రబాబు, లోకేష్ గురించి వైసీపీ నేతలు మాట్లాడే బూతులు డీజీపీకి కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగితే కనిపించలేదా అని అన్నారు. ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగబద్ధమైనప్పుడు, ప్రతిపక్ష పదవి రాజ్యాంగబద్ధం కాదా అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. 

Updated Date - 2021-10-21T17:35:49+05:30 IST