విశాఖకు పులివెందుల కల్చర్ వచ్చేసింది: పల్లా శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2021-12-20T18:09:10+05:30 IST

నగరానికి పులివెందుల కల్చర్ వచ్చేసిందని విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

విశాఖకు పులివెందుల కల్చర్ వచ్చేసింది: పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం: నగరానికి పులివెందుల కల్చర్ వచ్చేసిందని విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.  వైసీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హయ గ్రీవ జగదీష్ సెల్ఫీ వీడియోనే  ఇందుకు ఉదాహరణ అని... ఇలాంటి బాధితులు ఎంతోమంది విశాఖలో ఉన్నారని అన్నారు. పారిశ్రామికవేత్తలను వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురిచేసి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. స్మార్డ్ సిటీ  కార్పొరేషన్ చైర్మన్ జి వెంకటేశ్వరావుపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు అన్నీ విజయ సాయి రెడ్డి కనుసన్నల్లోనే జరిగుతున్నాయని ఆరోపించారు. విజయ సాయి రెడ్డి, జీవి ఈ ఇద్దరూ ఆడిటర్లే అని... వీరి అరాచకాలు చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని పల్లా శ్రీనివాసరావు అన్నారు. 

Updated Date - 2021-12-20T18:09:10+05:30 IST