చేసే అప్పులకు, పంచే పథకాలకు పొంతనలేదు: సుజాత

ABN , First Publish Date - 2021-07-14T17:31:44+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చేసే అప్పులకు, పంచే పథకాలకు పొంతనలేదు: సుజాత

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నకిలీ నవరత్నాల పేరుతో ప్రజలని మోసం చేస్తూ రాష్ట్రాన్ని వేలకోట్ల అప్పులలో ముంచుతుంది వైసీపీ ప్రభుత్వం అని మండిపడ్డారు. చేసే అప్పులకు, పంచే పథకాలకు పొంతనలేదన్నారు. ఈ రెండు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు, పెట్టిన ఖర్చులకు శ్వేతపత్రం విడుదల చేయాలని పీతల సుజాత డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-07-14T17:31:44+05:30 IST