ప్రతిపక్ష నాయకుల అరెస్టులు దారుణం

ABN , First Publish Date - 2021-08-02T05:07:54+05:30 IST

వైసీపీ ప్రభు త్వం 25 నెలల పాలన లో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన 25 మంది నాయకులను అ రెస్టు చేశారని టీడీపీ మండలాధ్యక్షుడు మద్దినేని హరిబాబు ఆరోపించారు.

ప్రతిపక్ష నాయకుల అరెస్టులు దారుణం
మాట్లాడుతున్న హరిబాబు

సంతనూతలపాడు, ఆగస్టు 1: వైసీపీ ప్రభు త్వం 25 నెలల పాలన లో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన 25 మంది నాయకులను అ రెస్టు చేశారని టీడీపీ మండలాధ్యక్షుడు మద్దినేని హరిబాబు ఆరోపించారు. ఆదివారం సంత నూతలపాడులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసి సమావేశంలో ఆ యన మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాన్ని పార్టీ ఆదే శాల మేరకు పరిశీలించేందుకు వెళ్లిన మాజీమంత్రి దేవినేని ఉమామహే శ్వరావును అరెస్టు చేయడం దారుణమన్నారు. వైసీపీ పాలనలో జరుగు తున్న అక్రమాలను అడ్డుకుంటే అరెస్టు చేయడం ముఖ్యమంత్రికి ఆనవా యితీగా మారిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు తన్నీరు శ్రీను, ఎ.శ్రీను, ఆర్‌.సుబ్బారావు, క్రిష్ణ, సురేష్‌, ఇంద్రబాబు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T05:07:54+05:30 IST