మతసామరస్యానికి ప్రతీక ఉరుస్‌ గంధోత్సవం

ABN , First Publish Date - 2021-01-21T05:59:05+05:30 IST

పెద్దాపురం, జనవరి 20: మతసామరస్యానికి ప్రతీక ఉరుస్‌ షరీఫ్‌ గంధోత్సవం అని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్ణణ శివారు పాతపెద్దాపురంలో ఉన్న హజరత్‌ షేక్‌ మదీనా పాచ్ఛా ఔళియా దర్గా వద్ద ఉరుస్‌ గంధోత్సవాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా

మతసామరస్యానికి ప్రతీక ఉరుస్‌ గంధోత్సవం
దర్గా వద్ద ప్రార్థన చేస్తున్న ఎమ్మెల్యే చినరాజప్ప

ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప 

పెద్దాపురం, జనవరి 20: మతసామరస్యానికి ప్రతీక ఉరుస్‌ షరీఫ్‌ గంధోత్సవం అని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్ణణ శివారు పాతపెద్దాపురంలో ఉన్న హజరత్‌ షేక్‌ మదీనా పాచ్ఛా ఔళియా దర్గా వద్ద ఉరుస్‌ గంధోత్సవాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు మహ్మద్‌ లాయక్‌ ఆలీ తదితరులు ఆయనకు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజప్ప వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులు గంధాన్ని దర్గా వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సమాధికి గంధాన్ని పూశారు. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన ఖురాన్‌ ఖానీ, ఖవ్వా లీ, ఫాతేహా ఖానీ కార్యక్రమాలు, మిమిక్రీ, మ్యాజిక్‌షో అలరించాయి. ఉత్సవానికి జనసేన ఇన్‌చార్జ్‌ తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకురాలు తుమ్మల పద్మజ హాజరయ్యారు. 

Updated Date - 2021-01-21T05:59:05+05:30 IST