Vijayawadaలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరసన
ABN , First Publish Date - 2021-08-28T16:07:25+05:30 IST
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.
విజయవాడ: పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నివాసం నుండి ధర్నా చౌక్పై సైకిల్, రిక్షాలపై నిరసన చేపట్టారు. ధరలు తగ్గాలి అంటే జగన్ పోవాలి అనే నినాదంతో ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలపై చంద్రబాబుపై విమర్శలు చేసిన జగన్ నేడు ఏమి సమాధానం చెప్తారని గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు.