టీడీపీ విజయానికి సమష్టిగా పనిచేయాలి
ABN , First Publish Date - 2022-01-28T05:57:14+05:30 IST
రాబోయే ఎన్నికలలో టీడీపీని అధికారం లోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త, నాయకులు కృషిచేయాలని మాజీ మంత్రి పల్లెరఘు నాథరెడ్డి, మాజీఎంపీ నిమ్మలకిష్టప్పలు పేర్కొన్నారు.
- మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
బుక్కపట్నం, జనవరి 27: రాబోయే ఎన్నికలలో టీడీపీని అధికారం లోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త, నాయకులు కృషిచేయాలని మాజీ మంత్రి పల్లెరఘు నాథరెడ్డి, మాజీఎంపీ నిమ్మలకిష్టప్పలు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని పాముదుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన గౌరవసభలో ఆయన మాట్లాడు తూ...ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి ప్రభుత్వం సామాన్యుల నడ్డివిరుస్తోం దన్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజాసంక్షేమం ముసుగులో రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టిస్తు న్నారన్నారు. అనంతరం రెడ్డివారిపల్లితండా, మదిరేబైలు, మ దిరైబైలుతం డా, వెంకటాపురం గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలు సుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పెద్దరాశుసు బ్ర హ్మణ్యం, సుబ్బారెడ్డి, అప్పస్వామి, మండల కన్వీనర్ చింతామలిరెడ్డి, మీసా ల మురళీ, పాముదుర్తిప్రసాద్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు లావణ్య గౌడ్, పార్లమెంట్ మహిళానాయకురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.