పీఆర్సీపై ఉపాధ్యాయుల నిరసన
ABN , First Publish Date - 2022-01-20T05:47:39+05:30 IST
పీఆర్సీ ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓలపై ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.
ధర్మవరం, జనవరి 19: పీఆర్సీ ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓలపై ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలో మంగళవారం భోజన విరామసమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ...చర్చల పేరుతో కాలయాపన చేసి పీఆర్సీ అశుతోష్ మిశ్రా కమిషనర్ నివేదికను ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వకుండా కార్యదర్శి ఇచ్చిన కమిషన్ను ఏకపక్షంగా అమలు చేయడం బాధాకరమన్నారు.