నేడు మమతను కలవనున్న తేజస్వీ యాదవ్!
ABN , First Publish Date - 2021-03-01T14:31:58+05:30 IST
పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో...
కోల్కతా: పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలకు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఉత్సాహం చూపుతోంది. అసోంలో జరగబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు దోస్తీ ఖాయం చేసుకుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్పై దృష్టి సారించిన ఆర్జేడీ మమత సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్తో జతకట్టాలని భావిస్తోంది.
ఈ నేపధ్యంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈరోజు బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలవనున్నారు. అసోంలో ఎంఐయూడీఎఫ్, కాంగ్రెస్ తదితర పార్టీలతో జతకట్టి ఆర్జేడీ ఎన్నికల మైదానంలోకి దిగబోతోంది. తన నాలుగు రోజుల పర్యటలో భాగంగా తేజస్వీ యాదవ్ ఆదివారం కోల్కతా చేరుకున్నారు. అక్కడి పార్టీ కార్యకర్తలను కలుసుకుని, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈరోజు ఉదయం సీఎం మమతా బెనర్జీని కలుసుకోనున్నారు.