తెలంగాణతో సమానంగా ఆయిల్పామ్ గెలల ధర
ABN , First Publish Date - 2021-01-21T06:17:41+05:30 IST
ఆయిల్పామ్ గెలల సేకరణ ధరను తెలంగాణాతో సమానంగా నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్దారిస్తు జీవో జారీ చేశారని, పామాయిల్ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర పామాయిల్ రైతుల సంఘం మాజీ అధ్యక్షుడు సత్తి రామారెడ్డి, జిల్లా పామాయిల్ రైతులసంఘం అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ, నాయకులు మురళీకృష్ణారెడ్డి, ముఖేష్లు తెలిపారు.
టన్నుకు రూ. 1000 పెరుగుదల
రంగంపేట, జనవరి 20: ఆయిల్పామ్ గెలల సేకరణ ధరను తెలంగాణాతో సమానంగా నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్దారిస్తు జీవో జారీ చేశారని, పామాయిల్ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర పామాయిల్ రైతుల సంఘం మాజీ అధ్యక్షుడు సత్తి రామారెడ్డి, జిల్లా పామాయిల్ రైతులసంఘం అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ, నాయకులు మురళీకృష్ణారెడ్డి, ముఖేష్లు తెలిపారు. వారు విలేకర్లతో మాట్లాడుతూ గతంలో ఏపీలో రే టునిర్దారించినా, తెలంగాణాలో నూతన టెక్నాలజీతో ఆయిల్ మిల్లులు నిర్మాణం చేయటంతో అక్కడ నూనె దిగుబడి ఎక్కువగా ఉండటంతో దిగుబడి ఆధారంగా రేటు నిర్ణయించటంతో ధరలో టన్నుకు రూ.1000 వర కూ తక్కువ వస్తోందన్నారు.