నేడు విఠల్‌ రుకుంబాయి కల్యాణం

ABN , First Publish Date - 2020-11-26T05:44:12+05:30 IST

జైనథ్‌ మండలంలోని లేఖర్‌వాడ గ్రామంలో ప్రతీ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక ఆలయంలో గల విఠల్‌ రుకుంబాయి మందిరం కల్యాణోత్సవానికి సర్వాంగ సుందరం గా ముస్తాబైంది.

నేడు విఠల్‌ రుకుంబాయి కల్యాణం
లేఖర్‌వాడలో ముస్తాబైన విఠల్‌రుకుంబాయి ఆలయం

లేఖర్‌వాడలో వేడుకలకు ముస్తాబైన ప్రధాన ఆలయం

జైనథ్‌, నవంబరు25: జైనథ్‌ మండలంలోని లేఖర్‌వాడ గ్రామంలో ప్రతీ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక ఆలయంలో గల విఠల్‌ రుకుంబాయి మందిరం కల్యాణోత్సవానికి సర్వాంగ సుందరం గా ముస్తాబైంది. గ్రామ ప్రజలు గురువారం జరిగే విఠల్‌ రుకుంబాయి ఆలయాన్ని రంగురంగుల పూలు, అలాగే విద్యుత్‌ బల్బులతో అలంకరించా రు. కాగా, విఠల్‌ రుకుంబాయిల కల్యాణ మహోత్సవ కార్యక్రమానికి జైనథ్‌ మండలంలోని ఆయా గ్రామాలతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు నడుపడంతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్‌ చంద మమత విఠల్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో భక్తులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. 

Updated Date - 2020-11-26T05:44:12+05:30 IST