ఆలయ ధర్మకర్తల మండలి ఆదర్శంగా నిలవాలి

ABN , First Publish Date - 2022-01-25T04:34:50+05:30 IST

రాయచోటి వీరభద్ర ఆలయ ధర్మకర్తల మండలి జిల్లాకు ఆదర్శంగా నిలవాలని ఎంపీ మిథున్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి అన్నారు.

ఆలయ ధర్మకర్తల మండలి ఆదర్శంగా నిలవాలి
ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఎంపీ మిథున్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

ఎంపీ మిథున్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి, జనవరి 24: రాయచోటి వీరభద్ర ఆలయ ధర్మకర్తల మండలి జిల్లాకు ఆదర్శంగా నిలవాలని ఎంపీ మిథున్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటిలోని భద్రకాళీ సమే త వీరభద్రస్వామి దేవస్థాన ధర్మకర్తలి మండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. వీరభద్రుని సన్నిధిలో నేతల సమక్షంలో ధర్మకర్తలి మండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌ రెడ్డి, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్‌గా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దశరథరామిరెడ్డి సతీమణి పి.విజయను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులు కమలాభాయి, ఎం.విజయ, సురే్‌షకుమార్‌, నాగభూషణం, నరసింహులు, పార్వతమ్మ, విజయభాస్కర్‌, రత్నశేఖర్‌రెడ్డి, ఎక్స్‌ ఆఫిషియో మెంబర్‌గా కృష్ణయ్య స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, వైస్‌ చైర్మన్‌లు దశరథరామిరెడ్డి, ఫయాజుర్‌ రెహమాన్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఆవుల విష్ణువర్థన్‌రెడ్డి, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T04:34:50+05:30 IST