సెమీ ఫైనల్కు దూసుకెళ్లిన జిల్లా జట్టు
ABN , First Publish Date - 2021-04-12T06:06:09+05:30 IST
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి అండర్-16 క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీలలో జిల్లా జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్లోని ఐవోసీ గ్రౌండ్లో జరిగిన ఈ ఛాంపియన్ షిప్ పోటీలలో సిద్ధిపేటపై జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. నిర్ణీత 20ఓవర్లలో 7 వికెట్ల
నిర్మల్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి అండర్-16 క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీలలో జిల్లా జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్లోని ఐవోసీ గ్రౌండ్లో జరిగిన ఈ ఛాంపియన్ షిప్ పోటీలలో సిద్ధిపేటపై జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. నిర్ణీత 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సిద్ధిపేట జట్టును, 17.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టంతో 134 పరుగులు చేసిన నిర్మల్ జట్టు అబ్బురపరిచింది. ఈ పోటీల లో జిల్లా జట్టుకు చెందిన శ్రీపాద్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కగా, సందీప్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ నెల 14న నిర్వహించే సెమీఫైనల్లో ఈ జట్టు పాల్గొననున్నట్లు టీసీఏ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కోచ్ రాంరాజ్ తెలిపారు. జట్టులో ఎస్.సందీప్, ఎస్.దినేష్, గోలి శరత్ చంద్ర, ఏ.భీమేష్, కే.శ్రీనివాస్, జే.యువరాజ్, జే.హర్షిత్, పి.నిహర్, ఏ. సిద్దు, జే.సౌమిత్, జే.స్వప్నిల్, ఏ.నవీన్, ఆర్. శ్రీపాదవ్, ఎం. రామ్, బి. మణికంఠ, సిద్దార్థలు ఉన్నారు.