ఉపాధి హమీ పనులు వేగవంతంగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-05-13T06:23:32+05:30 IST

ఉపాధిహమీ, పల్లెప్రగతి, హరితహారంపైన అన్ని మండలాల ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవో, ఇతర అధికారులతో మంగళవారం

ఉపాధి హమీ పనులు వేగవంతంగా పూర్తిచేయాలి

అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌


కరీంనగర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉపాధిహమీ, పల్లెప్రగతి, హరితహారంపైన అన్ని మండలాల ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవో, ఇతర అధికారులతో మంగళవారం అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా  మాట్లాడుతూ ఉపాధిహమీ పథకంలో చేపడుతున్న వైకుంఠధామాలు త్వరగా పూర్తిచేయాలన్నారు. జిల్లాలో అత్యధికంగా తిమ్మాపూర్‌ మండలంలో 7జీపీలలో ప్రారంభం కాకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఏమైనా సమస్యలుంటే స్థానికప్రజాప్రతినిదులు, అధికారులు చర్చించుకొని రెండురోజుల్లోపని ప్రారంభించి ఆన్‌లైన్‌లో మస్టర్‌ పేమెంట్‌ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామాలలో సెగ్రిగేషన్‌ షెడ్స్‌, ఇంకుడు గుంతలు, ఉపాధి హామీ పనిదినాలపై చర్చించారు. అన్ని మండలాలో కూడా ఉపాధి పనిదినాలలో రిపోర్టు చేసిన లేబర్‌కు పేమెంట్‌ చేసిన వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉందని ఈ గ్యాప్‌ ఎక్కడ ఉందో అందరూ కలిసి మస్టర్స్‌ పేమంట్స్‌ రెండు రోజుల్లో చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, ఏపీడీ మంజులదేవి, డీపీవో రఘువరన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-13T06:23:32+05:30 IST