యాచకుని ఆఖరి మజిలీ..

ABN , First Publish Date - 2021-05-11T05:06:53+05:30 IST

కరోనా కరాళనృత్యం చేస్తున్న తరుణంలో ఎవరైనా కాలం చెందినా అయిన వాళ్లు సైతం కడసారిగా చూపునకు నోచుకోలేని రోజులి.. ఇటువంటి పరి స్థితుల్లో ఓ యాచకుని మృదేహానికి అన్నీ తామై అంతిమ కార్యక్రమాలు నిర్వహించి గొలుగొండ పోలీసులు వారి గొప్ప మనసును చాటుకు న్నారు.

యాచకుని ఆఖరి మజిలీ..
మృతదేహాన్ని ఖననం చేయిస్తున్న దృశ్యం


  అయినవారు లేకపోయినా...అన్నీ తామైన గొలుగొండ పోలీసులు

గొలుగొండ, మే 10 : కరోనా కరాళనృత్యం చేస్తున్న తరుణంలో ఎవరైనా కాలం చెందినా అయిన వాళ్లు సైతం కడసారిగా చూపునకు నోచుకోలేని రోజులి.. ఇటువంటి పరి స్థితుల్లో ఓ యాచకుని మృదేహానికి అన్నీ తామై అంతిమ కార్యక్రమాలు నిర్వహించి గొలుగొండ పోలీసులు వారి గొప్ప మనసును చాటుకు న్నారు. మండలంలోని జోగంపేటలో ఓ యాచకుడు గత కొన్నాళ్లుగా తిరుగుతూ.. ఈ నెల ఆరో తేదీ సాయం త్రం గ్రామ సమీపంలోని పంట పొల్లాల్లో మృతిచెందాడు. ఈ విషయం గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న  ఎస్‌ఐ ధనుంజయనాయుడు మర్నాడు మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో భద్రపర్చారు. ఈ సమాచారాన్ని వివిధ పోలీస్టేషన్లతో పాటు మీడియాకు వివరించారు.  మృతుడి బంధువుల కోసం నాలుగు రోజులు వేచి చూశారు. అయినప్పటికీ ఎవరూ రాకపోవడంతో చివరకు సోమవారం సాయంత్రం గ్రామంలోని శ్మశాన వాటికలో టార్చ్‌లైట్‌ వెలుతురులో ఖననం పూర్తిచేశారు. 

Updated Date - 2021-05-11T05:06:53+05:30 IST