జెండా ఆవిష్కరించేది జిల్లా మంత్రే

ABN , First Publish Date - 2020-08-14T11:37:07+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లాకు చెందిన రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

జెండా ఆవిష్కరించేది జిల్లా మంత్రే

విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లాకు చెందిన రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జెండా ఆవిష్కరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు జెండా ఎగురవేస్తారని తొలుత ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు జిల్లా ప్రగతి నివేదిక, ఇతర కార్యక్రమాలపై ఇన్‌చార్జి మంత్రితో జిల్లా యంత్రాంగం చర్చించింది. 


ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లల్లో అధికారులు నిమగ్నమయ్యారు. గురువారం వర్షం పడుతున్నా మైదానం ముస్తాబు పనిలో ఉన్నారు. జెండా ఆవిష్కరించే వేదిక పరిసరాలను అందంగా తీర్చిదిద్దడం, కార్పెట్‌ వేయడం వంటివి సిబ్బంది చేపట్టారు.

Updated Date - 2020-08-14T11:37:07+05:30 IST