అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

ABN , First Publish Date - 2021-10-20T05:07:59+05:30 IST

మండలంలోని లింగాపూర్‌లో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందింది.

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

నారాయణఖేడ్‌,అక్టోబరు 19: మండలంలోని లింగాపూర్‌లో అనుమానాస్పద స్థితిలో  బాలిక మృతి చెందింది. మంగళవారం ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్‌ గ్రామానికి చెందిన బాలిక(16) ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నది. ఈ నెల 17న ఆదివారం రాత్రి ఆ బాలిక కోసం వెతుకుతున్న తండ్రికి పండరి అనే యువకుడితో ఇంటి వెనకాల కనిపించింది. తండ్రిని చూసిన వెంటనే ఆ ఇద్దరూ పారిపోయారు. ఓ గంట తర్వాత పండరి గ్రామానికి వచ్చాడు కానీ, బాలిక తిరిగి రాలేదు.  సోమవారం రాత్రి గ్రామ శివారులోని ఓ పొలంలో  చెట్టుకు చున్నీతో  ఉరేసుకున్న బాలిక మృతదేహం కనిపించింది. తన కూతురి  మృతి విషయంలో పండరిపైనే అనుమానం ఉందంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-20T05:07:59+05:30 IST