మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2020-09-26T09:21:07+05:30 IST

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ సంస్థ లక్ష్యమని ది కాకినాడ కో ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ

మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

కేసీబీఎస్‌ చైర్మన్‌ కోసూరి 


డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), సెప్టెంబరు 25: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ సంస్థ లక్ష్యమని ది కాకినాడ కో ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ (కేసీబీఎస్‌) చైర్మన్‌ కోసూరి శ్రీనివాస సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. రామయ్యవీధిలోని కేసీబీఎస్‌ కార్యాలయంలో శుక్రవారం సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ సహకార రంగంలో కొనసాగుతున్న కేసీబీఎస్‌ లో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సేవలు మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధ్యక్షుడు రెడ్డి రాజేంద్రకుమార్‌ మాట్లాడుతూ వ్యవస్థాపకుల ఆశయాలకు అనుగుణంగా సంస్థను ముందుకు నడిపించడంలో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలన్నారు. సంస్థ ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్‌ తదితర అంశాలపై చర్చించారు. సంస్థ కార్యదర్శి ముమ్మిడి గోవిందు, డైరెక్టర్‌ ముమ్మిడి రమణ, అడిటర్‌ సందీప్‌, ఇన్‌చార్జ్‌ మేనేజర్‌ ఎస్‌వీఆర్‌ మూర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-26T09:21:07+05:30 IST