అన్ని వర్గాల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-25T04:35:23+05:30 IST

అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్‌రెడ్డి అన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ లక్ష్యం
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

ఆత్మకూరు, అక్టోబరు 24: అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా  రాష్ట్ర  ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్‌రెడ్డి అన్నారు.  పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవికుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.  అనంత రం నూతనంగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ ఆత్మకూర్‌ మండ ల, పట్టణ అధ్యక్షులను సన్మానించారు. కార్యక్రమంలో చైర్‌ పర్సన్‌ గాయత్రి, వైస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి సభ్యుడు వీరేశలింగం, వైస్‌ ఎంపీపీ కోటేశ్వర్‌, పట్టణ అధ్యక్షుడు జానకీరామ్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T04:35:23+05:30 IST