చివరి ఆయకట్టుకు నీరందేలా చూడాలి
ABN , First Publish Date - 2021-01-17T05:19:57+05:30 IST
మండలంలో ని చివరి ఆయకట్టు వ్యవసాయ భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆధికారులను ఆదేశించారు.
- జడ్పీ చైర్మన్
మంథనిరూరల్, జనవరి 16: మండలంలో ని చివరి ఆయకట్టు వ్యవసాయ భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆధికారులను ఆదేశించారు. శనివారం రామగుండం ఈ ఎన్ఎసీ వెంకటేశ్వర్లుతో కలిసి ఎస్ఆర్ఎస్పీ కాల్వ చివరి ఆయకట్టు ఎక్లాస్పూర్ వద్ద కాలువను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి ఆయకట్టు ప్రాం తాలైన ఎక్లాస్పూర్, బిట్టుపల్లి గ్రామాలకు రా నున్న సీజన్లో సాగునీరందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని పుట్టపాక గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్-8 కా లువల మీద కొత్త డీపీలను ఏర్పాటు చేయాల ని సర్పంచ్ రొడ్డ మమత శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీనివాస్లు ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఇరిగేషన్ ఈఈ ప్రసాద్, ఏ ఈలు తిరుపతి, రఫీ, ముత్యాలు పాల్గొన్నారు.