మహాధర్నా విజయవంతం

ABN , First Publish Date - 2021-12-09T06:15:28+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా పాతగాజువాక జంక్షన్‌లో బుధవారం చేపట్టిన మహాధర్నా విజయవంతమైందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌, కో-కన్వీనర్‌లు గంధం వెంకటరావు, కేఎస్‌ఎన్‌.రావులు తెలిపారు.

మహాధర్నా విజయవంతం
మహా ధర్నా శిబిరంలో ఉద్యమ గీతాలను ఆవిష్కరిస్తున్న ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు

ఉక్కుటౌన్‌షిప్‌, డిసెంబరు 8: స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా పాతగాజువాక జంక్షన్‌లో బుధవారం చేపట్టిన మహాధర్నా  విజయవంతమైందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌, కో-కన్వీనర్‌లు గంధం వెంకటరావు, కేఎస్‌ఎన్‌.రావులు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు చేస్తున్న దీక్షలు 300 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ ఆందోళన చేపట్టామన్నారు. ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఎన్నో పోరాటాలు చేశామని, ఇదే ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం అన్ని వర్గాలతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-12-09T06:15:28+05:30 IST