మాస్క్ ధరించలేదని వ్యక్తిని చితకబాదిన పోలీసులు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-06-05T20:34:45+05:30 IST

మాస్క్ ధరించలేదని రాజస్థాన్‌లోని ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం చితకబాదారు. జోధ్‌పూర్ లో

మాస్క్ ధరించలేదని వ్యక్తిని చితకబాదిన పోలీసులు.. వీడియో వైరల్

న్యూఢిల్లీ: మాస్క్ ధరించలేదని రాజస్థాన్‌లోని ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం చితకబాదారు. జోధ్‌పూర్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. నిందితుడి చేతులను వెనక్కి విరిచి, పోలీసులు తమ కాళ్లతో ఆయనపై ప్రతాపం చూపారు. ఈ దృశ్యం మొత్తం కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పోలీసుల కథనం మరోలా ఉంది. మాస్క్ ఎందుకు ధరించలేదని తాము ప్రశ్నించామని, ఆ వ్యక్తే తమపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. అందుకే తాము అలా ప్రవర్తించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-06-05T20:34:45+05:30 IST