నవ వరుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-14T06:12:12+05:30 IST

ఇష్టం లేని పెళ్లి చేశారని నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని మనిమద్దె గ్రామంలో జరిగింది.

నవ వరుడు ఆత్మహత్య
సోమయ్య (ఫైల్‌ ఫొటో)

ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపం

శాలిగౌరారం, జనవరి 13: ఇష్టం లేని పెళ్లి చేశారని నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని మనిమద్దె గ్రామంలో జరిగింది. ఏఎస్‌ఐ ఎన్‌.శ్రీనివాస్‌ తెలి పిన వివరాల ప్రకారం.. మనిమద్దె గ్రామానికి చెందిన గోళ్ల రాములు-అచ్చమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌, యజమాని అయిన రెండో కుమారుడు  సోమయ్య(27)కు ఈనెల మూడో  తేదీన సూర్యాపేట జిల్లా తిరుమల గిరి మండలం ఫణిగిరికి చెందిన బంధువుల యువతితో  వివాహం జరిగింది. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని కుటుంబసభ్యులతో చెప్పి మంగళవారం ఇంట్లో నుంచి బయ టికి వెళ్లి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. కుటుంబసభ్యులు వెతికినా కనిపించలేదు. మని మద్దెలోని పాత ఇంట్లో సోమయ్య ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం గుర్తించి పోలీసులక సమాచారం అందించారు. సోమయ్య మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సోమ య్య తండ్రి పదేళ్ల క్రితం ఉరేసుకున్నాడు. అప్పడు భర్త, ఇప్పుడు కుమారుడు బలవన్మరణానికి పాల్పడటంతో తల్లి అచ్చమ్మ తల్లడిల్లుతోంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2021-01-14T06:12:12+05:30 IST