మూడేళ్లయినా మురుగు తొలగలేదు

ABN , First Publish Date - 2022-01-21T04:36:17+05:30 IST

మూ డు రోజుల్లో సమస్యను పరిష్క రిస్తామని అధికారులు అన్నారు. మూడేళ్లయినా సమస్యపై స్పం దించలేదు. కౌన్సిలర్‌ వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడూ వెళ్లాడు.

మూడేళ్లయినా మురుగు తొలగలేదు
మురుగునీటి సమస్యను భూపే్‌షరెడ్డికి తెలుపుతున్న 14వ వార్డు ప్రజలు

ఎర్రగుంట్ల, జనవరి 20: మూ డు రోజుల్లో సమస్యను పరిష్క రిస్తామని అధికారులు అన్నారు. మూడేళ్లయినా సమస్యపై స్పం దించలేదు. కౌన్సిలర్‌ వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడూ వెళ్లాడు. ప్ర యోజనం కన్పించలేదు. చిన్నపి ల్లలకు మాత్రం అలర్జీ వస్తోంది. ఆస్పత్రులకు వేలకు వేలు ఖర్చవుతోంది.

వీధులు బాగుచేయాలని, ఎక్కడికైనా వచ్చి ధర్నా చేసేందుకు సిద్దంగా ఉన్నామని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపే్‌షరెడ్డికి మహిళలు తమ గోడు వెలిబుచ్చారు. పైప్‌లైన్‌ లీక్‌ అవుతోందని వాటిని మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు విమర్శించారు. 

వెంటనే చర్యలు తీసుకోవాలి : భూపే్‌షరెడ్డి 

శాంతినగర్‌లో డ్రైనేజి, రోడ్ల పనులు వెంటనే పూర్తిచేయాలి. వీధుల్లోకి వెళ్లేందుకు దారిలేకుండా మురుగే కనిపిస్తోంది. మూడేళ్లుగా అభివృద్ధే జరగలేదు. కమిషనర్‌, ఛైర్మన్‌ స్పందించి సమస్యలను పరిష్కరించాలని టీడీపీ తరపున డిమాండ్‌ చేస్తున్న ట్లు భూపే్‌షరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడా రు. కార్యక్రమంలో టీడీపీ నేతలు చదిపిరాళ్ల జయరామిరెడ్డి, నాగరాజు, ఎస్‌.సంజీవరె డ్డి, షరీఫ్‌, కాండారెడ్డి, రమే్‌షరెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T04:36:17+05:30 IST