వ్యవస్థలే శాశ్వతం

ABN , First Publish Date - 2021-10-15T05:20:39+05:30 IST

ధర్మం, న్యాయాన్ని కాపాడే వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయని కోటబొమ్మాళి జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు తెలిపారు.

వ్యవస్థలే శాశ్వతం
మొక్కలు నాటుతున్న జూనియర్‌ సివిల్‌జడ్జి ప్రకాష్‌బాబు

టెక్కలి, అక్టోబరు 14: ధర్మం, న్యాయాన్ని కాపాడే వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయని కోటబొమ్మాళి జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు తెలిపారు. గురువారం నౌపడా ఆర్‌ఎస్‌ దరి పేడాడ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జనజాగృతి ఫౌండేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం నింపేందుకు  జనజాగృతి ఫౌండేషన్‌ మరింత అభివృద్ధి చెందాలని  ఆకాంక్షించారు. ఫౌండేషన్‌ చైర్మన్‌ పేడాడ పరమేశ్వరరావు మాట్లా డుతూ సేవా కార్యక్రమాలతో పాటు, సమాజహితం కోరే అన్ని ప్రక్రి యల్లో భాగస్వామ్యమవుతామని తెలిపారు. అనంతరం జనజాగృతి నిబంధనల ప్రతిని ఆవిష్కరించి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ సభ్యులు చంద్రశేఖర్‌ ఆజాద్‌, డి.వెంక ట్రావు, న్యాయవాది ఆనందరావు, మత్స్యకార నాయకుడు రాజారావు, సీనియర్‌ పాత్రికేయులు వెంకటరెడ్డి,  భగత్‌సింగ్‌, గణపతిరావు, సతీష్‌,  భారతీదేవి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-10-15T05:20:39+05:30 IST