నీతో ఓ మాట చెప్పాలంటూ భార్యను తీసుకెళ్లిన భర్త.. చివరగా అతను చెప్పిన మాటలు విని.. ఆమె మైండ్ బ్లాక్..

ABN , First Publish Date - 2022-01-10T01:52:53+05:30 IST

స్పెయిన్‌లో ఓ భర్త తన భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడు. నీతో ఓ మాట చెప్పాలంటూ భార్యను తీసుకెళ్లాడు. ఏం చెబుతాడబ్బా అంటూ వెళ్లిన ఆమెకు.. భర్త మాటలు విని చివరకు మైండ్ బ్లాక్ అయింది..

నీతో ఓ మాట చెప్పాలంటూ భార్యను తీసుకెళ్లిన భర్త.. చివరగా అతను చెప్పిన మాటలు విని.. ఆమె మైండ్ బ్లాక్..

నీతో ఒక విషయం చెప్పాలన్నప్పుడు.. కొందరికి ఎక్కడ లేని భయం పుట్టుకొస్తుంది. ఏం వార్త చెబుతారో.. ఎలాంటి దర్వార్త వినాల్సి వస్తుందో.. అనుకుంటూ ఒకటే కంగారు పడతారు. కొందరైతే ఎక్కువ సంతోషమైన వార్తయినా, బాధాకరమైన వార్తలనైనా విని తట్టుకోలేరు. స్పెయిన్‌లో ఓ భర్త తన భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడు. నీతో ఓ మాట చెప్పాలంటూ భార్యను తీసుకెళ్లాడు. ఏం చెబుతాడబ్బా అంటూ వెళ్లిన ఆమెకు.. భర్త మాటలు విని చివరకు మైండ్ బ్లాక్ అయింది.


స్పెయిన్‌కి చెందిన టెర్రీ ఎడ్గెల్, జూడ్ దంపతులు. వీరికి పెళ్లయినప్పటి నుంచి బలమైన కోరిక ఒకటి ఉండేది. ఆ కోరిక నెరవేర్చుకునే క్రమంలో చాలా కష్టపడ్డారు. కానీ కోరిక మాత్రం నెరవేరలేదు. అయితే ఎట్టకేలకు ఇటీవల ఆ కోరికను భర్త నెరవేర్చాడు. ఆ వార్తను భార్యకు చెప్పి సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాడు. ఓ రోజు తన దగ్గరికి వెళ్లి.. నీతో అర్జంట్‌గా ఓ మాట చెప్పాలి పదా.. అంటూ కౌబ్రిడ్జ్ వేల్ ఆఫ్ గ్లామోర్గాన్ అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు. భర్త ఎడ్గెల్ ఏం చెబుతాడో, ఏం వినాల్సి వస్తుందో అనుకుంటూ కంగారుగా, భయంగానే వెళ్లింది.

ఫొటోలు చూసి యువతులను సెలెక్ట్ చేసుకోవాలట.. మనిషికో రేటు కట్టేశారు.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగానే..


తీరా అక్కడికి వెళ్లాక భార్య జూడ్ కళ్లు మూసి, తాను చెప్పాలనుకున్నాది చెప్పేశాడు. ఓ కోట ముందు తనను నిల్చోబెట్టి.. మనం ఎప్పటి నుంచో కలలు కంటున్న పురాతన కాలం నాటి కోటను కొనేశాను.. అంటూ విషయం బయటపెట్టాడు. కోటను చూసిన ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కౌబ్రిడ్జ్ వేల్ ఆఫ్ గ్లామోర్గాన్ ప్రాంతంలో 200 ఏళ్ల కాలం నాటి పెన్లిన్ కోటలో నివాసం ఉండాలనేది.. ఎప్పటి నుంచే వారి కల అని చెప్పారు. దీంతో భార్యకు తెలీకుండా ఆ కోటను వేలంలో రూ.5 కోట్లకు కొన్నట్లు ఎడ్గెల్ తెలిపాడు. ఫారెస్ట్ గ్రూప్ సీఈవో అయిన టెర్రీ ఎడ్గెల్.. చాలా బిజీగా ఉండటంతో ఆ కోట పునరుద్ధరణ పనులన్నీ జూడ్‌ ఒక్కటే చూసుకుంటోంది. 2024లోగా గృహప్రవేశం చేయనున్నట్లు ఈ దంపతులు చెబుతున్నారు.

అటవీ ప్రాంతంలో, గడ్డకట్టే చలిలో.. పురిటినొప్పులతో గర్భిణి అవస్థలు.. ఇంతలో వారంతా గుంపులుగా వచ్చి..

Updated Date - 2022-01-10T01:52:53+05:30 IST