నీతో ఉండలేను.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భర్తకు తేల్చిచెప్పిన భార్య.. చివరకు జరిగిన దారణమిది..!

ABN , First Publish Date - 2021-09-02T21:49:20+05:30 IST

వారిద్దరికీ ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఏడాదిన్నర క్రితం అతడికి ఓ ప్రమాదం జరిగి కాలు విరిగిపోయింది..

నీతో ఉండలేను.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భర్తకు తేల్చిచెప్పిన భార్య.. చివరకు జరిగిన దారణమిది..!

వారిద్దరికీ ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఏడాదిన్నర క్రితం అతడికి ఓ ప్రమాదం జరిగి కాలు విరిగిపోయింది.. అలాగే శరీరంలో పలుచోట్ల గాయాలు కూడా అయ్యాయి.. కష్టకాలంలో భర్తకు అండగా ఉండాల్సిన మహిళ, తన దారి తను చూసుకుంది.. పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.. తిరిగి రమ్మని భర్త ఎంతగా బతిమాలినా ఆమె రాలేదు.. దీంతో మనస్తాపానికి గురైన భర్త తాజాగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన జరిగింది. 


మీరట్ సమీపంలోని వాలిద్ పూర్‌కు చెందిన బాబీ కుమార్ ఏడాదిన్నర క్రితం ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. కాలు కూడా విరిగిపోయింది. దీంతో అతడి భార్య రేణు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు బాబి ఎంతగానో ప్రయత్నించాడు. ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి ఎంతగానో ప్రాథేయపడ్డాడు. అయితే ఆమె తిరిగి బాబితో ఉండేందుకు ఇష్టపడలేదు. ఎట్టి పరిస్థితిల్లోనూ వచ్చేది లేదని చెప్పేసింది. దీంతో మనస్తాపానికి గురైన బాబి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-02T21:49:20+05:30 IST