డిసెంబర్లోగా పనులు పూర్తి చేౄయాలి
ABN , First Publish Date - 2022-08-05T05:53:07+05:30 IST
నూతన సమీకృత కార్యాలయ భవనాల నిర్మాణాన్ని డిసెంబర్లోగా పూర్తి చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
- భవన నిర్మాణ పనుల పరిశీలన
గద్వాల క్రైం, ఆగస్టు 4 : నూతన సమీకృత కార్యాలయ భవనాల నిర్మాణాన్ని డిసెంబర్లోగా పూర్తి చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కార్యాలయ భవన నిర్మాణ పనులను గురు వారం కలెక్టర్ శ్రీహర్షతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్లు, విద్యు త్ సౌకర్యం, ఇతర ఇంటర్నల్ పనులన్నింటినీ డిసెంబర్లోగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రతీ రోజు ఎంత పని అయ్యింది, ఎన్ని పనులు చేయాల్సి ఉందనే వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ముని సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఈఈ ప్రగతి, డీఈ కిరణ్కుమార్, ఏఈ రాజేశ్వరి, ఎంపీపీ విజయ్, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్ పాల్గొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
రాజోలి : మన ఊరు - మన బడి కార్యక్ర మంలో భాగంగా చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ, మాన్దొడ్డి, నసనూర్, పెద్ద తాండ్రపాడు గ్రామా ల్లో గురువారం ఆయన పర్యటించారు. మన ఊరు - మన బడి కార్యక్రమానికి ఎంపికైన పాఠశాల్లో చేపట్టిన పనులను పరిశీలించి మాట్లాడారు. చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని డీఈ ఆంజనేయులకు సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా పనులు కొనసాగించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోవింద్రావు, ఎంఈవో నర్శింహులు, ఎంపీవో ఖాజామొద్దీన్, ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.