వంశధార కాలువలో పడి యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-10-22T05:24:18+05:30 IST
మండలం కరకవలస కాలనీ సమీపంలో వంశధార ప్రధాన ఎడమ కాలువలో పడి నిమ్మడాల వెంకటేష్ (25) మృతి చెందాడు.
జలుమూరు, అక్టోబరు 21: మండలం కరకవలస కాలనీ సమీపంలో వంశధార ప్రధాన ఎడమ కాలువలో పడి నిమ్మడాల వెంకటేష్ (25) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. విశాఖ జిల్లా యలమంచిలి మండలం చిన్నచేకులపాలెం గ్రామానికి చెందిన వెంకటేష్ కరకవలస కాలనీలో స్నేహితుని వివాహానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి బుధవారం సాయంత్రం వంశధార కాలువలో స్నానానికి వెళ్లాడు. స్నానానికి వంశధార కాలువలోకి దిగి కొట్టుకుపోవడంతో మిగతా స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వెంకటేష్ గురువారం ఉదయం కాలనీకి 100 మీటర్ల దూరంలో శవమై కనిపించాడు. మృతుడు విశాఖలో పైజర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మృతుడి అన్నయ్య నిమ్మడాల శివ గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.పారినాయుడు తెలిపారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి తల్లి, అన్నయ్య ఉన్నారు.