హోటల్లో స్నేహితురాలితో గడిపిన యువకుడు.. కొన్నాళ్లకు ఫోన్లో సీన్ టూ సీన్ ప్రత్యక్షం.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-02-03T00:34:28+05:30 IST
మంచి కోసం ఉపయోగించాల్సిన కెమెరాలను కొందరు చెడు పనుల కోసం వినియోగిస్తున్నారు. బెంగళూరులో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఓ యువకుడు తన స్నేహితురాలితో హోటల్లో ఏకాంతంగా గడిపాడు. అయితే...
గోడలకు చెవులు ఉంటాయన్నది పాత సామెత.. ప్రస్తుతం గోడలకి కళ్లు కూడా ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఎలాంటి అక్రమాలు చేసినా ఇట్టే దొరికిపోతారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు.. ఎన్నో క్లిష్టమైన కేసులను కూడా ఇట్టే పరిష్కరిస్తున్నారు. ఇదిలావుండగా, మంచి కోసం ఉపయోగించాల్సిన కెమెరాలను కొందరు చెడు పనుల కోసం వినియోగిస్తున్నారు. బెంగళూరులో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఓ యువకుడు తన స్నేహితురాలితో హోటల్లో ఏకాంతంగా గడిపాడు. అయితే కొన్నాళ్లకు ఫోన్లో వీడియో చూసుకుని ఖంగుతిన్నాడు. అసలేం జరిగిందంటే..
బెంగళూరు ఆస్టిన్టౌన్కు చెందిన యువకుడు, ఓ యువతికి ఏర్పడిన పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఓ రోజు హోటల్లో గది తీసుకుని స్నేహితురాలితో గడిపాడు. ఈ క్రమంలో గత నెల 21వ తేదీన యువకుడు తన ఫోన్తో సరదాగా కాలక్షేపం చేస్తుండగా.. ఓ వీడియో ప్రత్యక్షమైంది. తాను హోటల్లో స్నేహితురాలితో గడిపిన క్షణాలను సీన్ టూ సీన్ ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసి ఖంగుతిన్న యువకుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హోటల్ సిబ్బందిని స్టేషన్కి పిలిపించి ప్రశ్నించారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.