పిడుగురాళ్లలో పట్టపగలు భారీ చోరీ
ABN , First Publish Date - 2021-10-22T05:26:03+05:30 IST
పట్టణంలోని జానపాడురోడ్డుకు చెందిన దుర్గాఫార్మసీ యజమాని ఆతుకూరి పూర్ణచంద్రరావు ఇంట్లో గురువారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది.
రూ.26 లక్షల బంగారు, వెండి నగల అపహరణ
పిడుగురాళ్ల, అక్టోబరు 21: పట్టణంలోని జానపాడురోడ్డుకు చెందిన దుర్గాఫార్మసీ యజమాని ఆతుకూరి పూర్ణచంద్రరావు ఇంట్లో గురువారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మామగారిని చూసేందుకు పూర్ణచంద్రరావు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. గమనించిన దొంగలు తాళాలు తొలగించి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 25 సవర్ల బంగారం, 15 కేజీల వెండిని అపహరించుకుపోయారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు గుంటూరులోని పూర్ణచంద్రరావుకు సమాచారం అందించారు. ఎస్ఐ సమీర్బాష సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.