మూడు దుకాణాల్లో చోరీ

ABN , First Publish Date - 2020-09-21T07:13:29+05:30 IST

మండల కేంద్రంలో గల మూడు షాపుల్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగినట్లు ఎస్‌ఐ పాండేరావు తెలిపారు. ఆయన తెలిపిన

మూడు దుకాణాల్లో చోరీ

ధర్పల్లి, సెప్టెంబరు 20: మండల కేంద్రంలో గల మూడు షాపుల్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగినట్లు ఎస్‌ఐ పాండేరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దొంగలు షట్టర్‌లకు వేసిన తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. గ్రామానికి చెందిన సిద్దేశ్వర్‌ కిరాణా షాపులో రూ.20 వేల నగదును దొంగిలించారు. అక్కడే షాపు యజమానికి చెందిన బైకు తాళం చెవి ఉండడంతో అది తీసుకొని బైకును ఎత్తుకెళ్లినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. వరుస దొంగతనాలతో గ్రామస్థులు భ యాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో చోరీకి సం బంధించిన ఆనవాళ్లు దొరకలేవు. ప్రతి షాపులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్‌ఐ సూచించారు. 

Updated Date - 2020-09-21T07:13:29+05:30 IST