సామర్లకోటలో చోరీ
ABN , First Publish Date - 2020-02-23T06:48:05+05:30 IST
పట్టణ పరిధిలోని స్థానిక కొత్తూరు వీధిలో చుండ్రు జ్యోతిమాణిక్యాంబ ఇంటిలో శుక్ర వారం అర్ధరాత్రి చోరీ
రూ.6 లక్షల ఆభరణాల అపహరణ
సామర్లకోట ఫిబ్రవరి 22: పట్టణ పరిధిలోని స్థానిక కొత్తూరు వీధిలో చుండ్రు జ్యోతిమాణిక్యాంబ ఇంటిలో శుక్ర వారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలుగొట్టి లోపలికి ప్రవేశించి సుమారు నాలుగున్నర లక్షల విలువైన బంగారం, రూ.50 వేలు విలువైన వెండి, రూ.లక్ష విలువైన పట్ట చీరలను అపహరించారు. మాణిక్యాంబ శుక్రవారం రాత్రి ఇంటికి తాళాలు వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి శనివారం ఉదయం ఇంటికి చేసుకునేసరికి ఇల్లంతా చిందవం దరగా ఉండడంతో చోరీ జరిగినట్టు గుర్తించి సామర్లకోట పోలీసులకు సమాచారం అందించారు. కాకినాడకు చెందిన క్లూస్టీం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆధారాలను సేకరించింది. కాగా ఎమ్మెల్యే చినరాజప్ప చేరుకుని మాణి క్యాంబను ఆరాతీసి ఓదార్చారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుమంత్ తెలిపారు.