తాళం వేసిన ఇంట్లో చోరీ
ABN , First Publish Date - 2020-02-28T11:12:06+05:30 IST
బీబీపేట్ మండలంలోని శివారు రాంరెడ్డిపల్లి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో నుంచి బంగారం చోరీ అయినట్లు బీబీపేట్
బీబీపేట్, ఫిబ్రవరి27: బీబీపేట్ మండలంలోని శివారు రాంరెడ్డిపల్లి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో నుంచి బంగారం చోరీ అయినట్లు బీబీపేట్ ఎస్సై శంకర్ గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శివారు రాంరెడ్డిపల్లి గ్రా మానికి చెందిన రజిత అనే మహిళ తాళం వేసి బయటకు వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బంగారంను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.