కరోనా పరీక్ష కిట్లు లేవు
ABN , First Publish Date - 2020-07-09T10:38:04+05:30 IST
వీరవాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం 11 మందికి కొవిడ్19 ట్రూనాట్ పరీక్షలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బాధితులు, సిబ్బందికి తిప్పలు
కంటైన్మెంట్ జోన్, పారిశుధ్యంపైనే అధికారుల దృష్టి
వీరవాసరం, జూలై 8: వీరవాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం 11 మందికి కొవిడ్19 ట్రూనాట్ పరీక్షలు నిర్వహించారు. కాగా మరింత మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కిట్లు లేవు. ఇప్పటి వరకు పీహెచ్సీ పరిధిలో పది మంది కరోనా బాధితులను గుర్తించారు. వారి నుంచి ప్రైమరి కాంటాక్ట్ వ్యక్తులను సర్వే చేసి గుర్తించారు. వారందరికీ ట్రూనాట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కిట్లు కొరత కారణంగా వారికి పరీక్షలు చేయకపోవడంతో కరోనా బాధితులను గుర్తించిన ప్రదేశాల్లో పరిసరాల వారు ఆందోళనకు గురవుతున్నారు.