పనులు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-06-12T05:09:15+05:30 IST
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అధి కారులను ఆదేశించారు. శుక్రవారం రామయ్యపుట్టుగలోని తన స్వగృహంలో నాలుగు మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కవిటి: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అధి కారులను ఆదేశించారు. శుక్రవారం రామయ్యపుట్టుగలోని తన స్వగృహంలో నాలుగు మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివిధ అంశాలపై చర్చించారు. సోంపేట మండలానికి రెండేళ్ల కిందట ఎంపీ నిధులతో చేపట్టిన పనులు నేటికీ పూర్తి కాకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభు త్వ హయాంలో మంజూరైన పనులకు సంబంధించిన బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయని అధికారులను నిలదీశారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తే వాటికి అధికారులు మోకాళ్లు అడ్డుపడుతుండడం సరికాదన్నారు. ఇప్పటికైనా వెంటనే పనులు పూర్తి చేసి బిల్లులు మంజూరు చేయాలని సూచించారు. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాలకు చెందిన ఈఏలు పాల్గొన్నారు.