తిరుమల లడ్డూలు విక్రయం

ABN , First Publish Date - 2020-06-04T10:04:19+05:30 IST

తిరుపతి తిరుమల లడ్డూలను టీటీడీ ద్వారా జిల్లా కేంద్రంలో బుధవారం విక్రయించారు.

తిరుమల లడ్డూలు విక్రయం

పద్మావతి కాలనీ, జూన్‌ 3: తిరుపతి తిరుమల లడ్డూలను టీటీడీ ద్వారా జిల్లా కేంద్రంలో బుధవారం విక్రయించారు. 1000 లడ్డూలను విక్రయానికి ఉంచగా, గంటలోపే అయిపోయాయి. రూ.25కు ఒకటి, ఒక్కొక్కరికి రెండు చొప్పున అమ్మారు. దొరకని వారు నిరాశగా వెనుదిరిగారు. లాక్‌డౌన్‌ కారణంగా రెండున్నర నెలలుగా తిరుపతి ఆలయాన్ని మూసి వేసిన విషయం తెలిసిందే. అయితే భక్తులకు లడ్డూలను అందుబాటులోకి తేవాలని దేవస్థానం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో విక్రయించారు. కొందరు అధికారులు, పోలీసులు సైతం లడ్డూలను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. లడ్డూలు శుక్రవారం మళ్లీ రానున్నట్లు టీటీడీ కో ఆర్డినేటర్‌ రామాచారి తెలిపారు.

Updated Date - 2020-06-04T10:04:19+05:30 IST