ఈ ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదు
ABN , First Publish Date - 2021-12-06T05:19:43+05:30 IST
ఈ ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదని వైసీపీ మంత్రులు, నాయకులు మొదట మహిళలను ఎలా గౌరవించాలో నేర్చుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి సూచించారు.
- ఓటీఎస్కు సొమ్ము చెల్లించకండి
- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
గుర్రంకొండ, డిసెంబరు 5: ఈ ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదని వైసీపీ మంత్రులు, నాయకులు మొదట మహిళలను ఎలా గౌరవించాలో నేర్చుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి సూచించారు. గుర్రంకొండ మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం ఆయన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పరామర్శించ ారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభలో ప్రజా సమస్యలను పక్కన్న పెట్టి ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ఓటీఎస్కు లబ్ధిదారులెవ్వరూ సొమ్ము చెల్లించనవసరం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. రైతుల పేరిట వచ్చిన ట్రాన్స్ఫార్మర్లను వైసీపీ నాయకులు లక్షలాది రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం శోచనీయమన్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రైతన్నలకు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హరిప్రసాద్నాయుడు, నాయిని జగదీష్, నౌషాద్ అహ్మద్, మేకల చలపతి, ప్రదీప్, రెడ్డిప్రసాద్నాయుడు, చంద్రబాబు, మహత్మా రెడ్డి, ఇక్బాల్ ఖాసీం, ముజమిల్, జమీర్, నాగరాజ, ఆనంద్, శెట్టివారి ఉమాశంకర్, చలమారెడ్డి, నారా వెంకటరమణ, విజయ్కుమార్, రెడ్డెప్పరెడ్డి, ఎస్.వెంకటరమణ, కాంత్రికుమార్, ద్వారక, సుంకర శేఖర్, అనిల్, బాబు, రామాంజులు, సిద్ధు, ప్రకాశ్, రంజిత్, రామయ్య, బాబా జాన్, నారాయణ, హుస్సేన్, జయసూరి, రమణ, రాజన్న తదితరులు పాల్గొన్నారు.