‘‘నీకో బహుమతి ఇస్తా, ఊరి బయటకు వచ్చెయ్’’.. అంటూ ప్రియురాలిని పిలిచిన యువకుడు.. మాట్లాడుతూ మాట్లాడుతూ..

ABN , First Publish Date - 2022-03-04T22:00:28+05:30 IST

విష్ణు అనే యువకుడికి, స్వప్న అనే యువతికి ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. అనంతరం వారి మధ్య ప్రేమ చిగురించింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా ఏడాది కాలంగా...

‘‘నీకో బహుమతి ఇస్తా, ఊరి బయటకు వచ్చెయ్’’.. అంటూ ప్రియురాలిని పిలిచిన యువకుడు.. మాట్లాడుతూ మాట్లాడుతూ..
ప్రతీకాత్మక చిత్రం

నిర్మాణంలో ఉన్న ఇంట్లో తల లేని యువతి మొండాన్ని మార్చి ఒకటో తేదీన స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో దొరికిన వస్తువుల ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో విష్ణు అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే అతడిపై అనుమానం రావడంతో మళ్లీ పిలిచి.. తమదైన శైలిలో విచారించగా సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్రకూట్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


ఉత్తరప్రదేశ్‌ చిత్రకూట్ జిల్లా మౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్వా గ్రామానికి చెందిన విష్ణు అనే యువకుడికి, స్వప్న అనే యువతికి ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. అనంతరం వారి మధ్య ప్రేమ చిగురించింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా ఏడాది కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే అనూహ్యంగా స్వప్న కుటుంబ సభ్యులు ఇటీవల కూతురికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు. ఈ క్రమంలో తికమ్‌గఢ్ జిల్లాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయం చేశారు. ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుని ఫిబ్రవరి 16న ముహూర్తం నిర్ణయించుకున్నారు. పెద్దల మాటకు ఎదురు చెప్పలేక స్వప్న కూడా అందుకు అంగీకరించిది. అయితే ఈ విషయం విష్ణుకు తెలిసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రియురాలితో మాట్లాడాలని ఫిబ్రవరి 7న ఆమె ఉంటున్న గ్రామానికి వెళ్లాడు.

‘‘వరుసగా అన్ని సార్లు ఎవరు ఫోన్ చేస్తున్నారు’’.. అని అడిగిన ప్రియుడు.. చివరకు ఆమె చెప్పిన సమాధానం విని..


ఊరి బయట నుంచి స్వప్నకు ఫోన్ చేశాడు. ‘‘నీకో బహుమతి ఇవ్వాలి.. ఊరి బయట నిర్మాణంలో ఉన్న ఇంటికి వచ్చెయ్’’.. అని పిలిచాడు. దీంతో అతడు రమ్మన్న ప్రదేశానికి స్వప్న ఒక్కటి వెళ్లింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. ‘‘నిన్ను మరచిపోయి నేను బతకలేను.. ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం పద’’ అని స్వప్నతో అన్నాడు. ‘‘తల్లిదండ్రులను కాదని నేను ఎక్కడికీ రాలేను.. నన్ను మర్చిపోయి నువ్వు కూడా వేరే పెళ్లి చేసుకో’’ అంటూ స్వప్న తెగేసి చెప్పింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న విష్ణు.. ప్రియురాలి మాటలకు మరింత ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న స్నేహితులు సూరజ్‌, కౌశల్‌తో కలిసి.. స్వప్న తల నరికేసి మొండాన్ని వేరు చేశాడు. అనంతరం స్వప్న ఫోన్‌ను పొలాల్లో విసిరేసి వెళ్లిపోయారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులకు.. స్థానికుల సమచారంతో మార్చి 1న  స్వప్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విష్ణును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అతడికి సహకరించిన ఇద్దరు స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఈమె ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మగలరా..? 6నెలల్లోనే 16 కేజీల బరువు తగ్గి.. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత..

Updated Date - 2022-03-04T22:00:28+05:30 IST