హైదరాబాద్ : లాక్డౌన్లో చైనా కంపెనీ భారీ మోసం
ABN , First Publish Date - 2020-08-13T22:22:03+05:30 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే
హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో చైనాకు చెందిన ఓ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ పేర్లతో దేశవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల వరకు చైనా కంపెనీ వసూలు చేసింది. పలువురి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చైనాకు చెందిన వ్యక్తితో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. కాగా.. లాక్డౌన్ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో మోసం జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ భారీ మోసానికి పోలీసులే ఒకింత కంగుతిన్నారట.