ముగ్గురు కేన్సర్ రోగులకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-04-10T11:58:32+05:30 IST

కేన్సరుతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ముగ్గురు రోగులకు కరోనా వైరస్ సోకిన ఘటన....

ముగ్గురు కేన్సర్ రోగులకు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ : కేన్సరుతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ముగ్గురు రోగులకు కరోనా వైరస్ సోకిన ఘటన ఢిల్లీలోని ఢిల్లీ స్టేట్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆసుపత్రిలో వెలుగుచూసింది. ఆసుపత్రిలో చేరిన కేన్సర్ రోగులకు వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది ద్వార కరోనా సోకిందని వైద్యులు భావిస్తున్నారు. దీంతో కరోనా సోకిన కేన్సర్ రోగులను రాజీవ్ గాంధీ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటరుకు తరలించారు. అనంతరం ఢిల్లీ స్టేట్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆసుపత్రిని శానిటైజ్ చేయించి తాత్కాలికంగా మూసివేశారు.ఆసుపత్రిలో ఉన్న మరో 19 మంది కేన్సర్ రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు.  ఢిల్లీలోని 25 హాట్ స్పాట్లలో కరోనా కేసులు అధికంగా వెలుగుచూడటంతో అందరూ మాస్క్ లు ధరించాలని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు.


Updated Date - 2020-04-10T11:58:32+05:30 IST