థియేటర్లలో ప్రభుత్వ నిర్ణయించిన మేరకే టికెట్లు విక్రయించాలి
ABN , First Publish Date - 2021-04-14T06:08:53+05:30 IST
నూజివీడు పట్టణంలోని థియేటర్లు యజమానులు ప్రభుత్వం అధిక ధరలకు సినిమా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఎం.సురేష్కుమార్ అన్నారు.
నూజివీడు రూరల్ : నూజివీడు పట్టణంలోని థియేటర్లు యజమానులు ప్రభుత్వం అధిక ధరలకు సినిమా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఎం.సురేష్కుమార్ అన్నారు. పట్టణంలోని సినిమా థియేటర్లను మంగళవారం తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయాలన్నారు. . స్ర్కీన్-1లో గోల్డ్- రూ.112లకు, సిల్వర్-రూ. 60లకు, స్ర్కీన్-2లో ప్లాటినమ్- రూ.150లకు, గోల్డ్- రూ.112లకు, సిల్వర్-రూ. 60లకు, స్ర్కీన్-3లో గోల్డ్- రూ.112లకు, సిల్వర్-రూ. 60లకు మాత్రమే టికెట్లధరలు ఉండాల న్నారు. కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.