టిడ్కో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 890 మంది బాధితులు

ABN , First Publish Date - 2021-05-11T05:25:48+05:30 IST

నంద్యాల టిడ్కో గృహ సముదాయాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 890 మంది బాధితులు ఉన్నట్లు నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దినే్‌షరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

టిడ్కో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 890 మంది బాధితులు

నంద్యాల, మే 10: నంద్యాల టిడ్కో గృహ సముదాయాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 890 మంది బాధితులు ఉన్నట్లు నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దినే్‌షరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సెకెండ్‌ వేవ్‌ కరోనా ప్రారంభమైన తరువాత ఏర్పాటు చేసిన టిడ్కో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఇప్పటివరకు మొత్తం 2,420 మంది పాజిటివ్‌ వచ్చిన వారు అడ్మిషన్‌ అయ్యారని తెలిపారు. ఇందులో 1,431 మంది డిశ్చార్జి కాగా 99 మందిని రెఫర్‌ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 890 మంది బాధితులకు అన్ని సౌకర్యాలు అందిస్తున్న ఆయన పేర్కొన్నారు.


Updated Date - 2021-05-11T05:25:48+05:30 IST