29 నుంచి తిరుమలగిరి వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు
ABN , First Publish Date - 2021-04-14T06:05:53+05:30 IST
తిరుమలగిరిలో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ఈ నెల 29న జరుగునున్న సందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను మంగళవారం ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను నివాసంలో ఆయన సతీ సమేతంగా ఆవిష్కరించారు.
జగ్గయ్యపేట, ఏప్రిల్ 13: తిరుమలగిరిలో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ఈ నెల 29న జరుగునున్న సందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను మంగళవారం ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను నివాసంలో ఆయన సతీ సమేతంగా ఆవిష్కరించారు. తొలుత ఆలయ అర ్చకులు ఉగాది పండుగ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఈవో సూర్యచక్రధరరావు, సామినేని ప్రశాంత్బాబు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.